అంతకు ముందు ఏపీ సిఐడి సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. అంతకు ముందు, తిరుమలలో పరకామణిలో జరిగిన అక్రమాలు, లోక్ అదాలత్లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను పోలీసు శాఖ, డీజీపీ పట్టించుకోకపోవడంపై హైకోర్టు పడింది. సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు, ఆధారాలను తారుమారు చేసేందుకు నిందితులకు పోలీసులు, డీజీపీ సహకరిస్తున్నారని ఆగ్రహించింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో తిరుమల పరకామణిలో చోరీ కేసు నమోదైంది. ఈ ఘటనపై 2023లోనే టీటీడీ విజిలెన్స్కు ఫిర్యాదు అందింది. ఉద్యోగి రవికుమార్ పెద్దఎత్తున పరకామణిని కొల్లగొట్టారని అందులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి టీటీడీ అధికారులు సమగ్ర దర్యాప్తు జరపకుండా లోకాయుక్తతో రాజీ చేయించారు. శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ వేయడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది.
పరకామణిలో శ్రీవారి నగదు అపహరణ, కేసు పెట్టడం, లోక్అదాలత్లో రాజీపై రికార్డులన్నీ సీజ్ చేసి తదుపరి విచారణకు సీల్డ్ కవర్లో సమర్పించాలని సీఐడీ డీజీని ఆదేశించింది. అందులో భాగంగా సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది.

More Stories
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ భారత్ కైవసం
వచ్చే 50 ఏళ్లకు ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే