
దాంతో కంగనా రనౌత్ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మహిందర్ కౌర్ అనే వృద్ధ మహిళను కించపర్చేలా రీట్వీట్ చేశారు. ఆమె రూ.100 కిరాయికి వస్తుందని తన రీట్వీట్లో పేర్కొన్నారు. దాంతో మహిందర్ కౌర్ పరువునష్టం కేసు వేశారు.దాంతో కౌర్ ఫిర్యాదును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కంగనా ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆమె పిటిషన్ను తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆమెకు చీవాట్లు పెట్టింది. ‘మీ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి? మీది సింపుల్ రీట్వీట్ కాదు. మీరు మీ సొంత కామెంట్స్ చేశారు. మసాలా జోడించారు’ అని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దాంతో తన క్లయింట్ ఆ రీట్వీట్పై స్పష్టత ఇచ్చారని కంగనా తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా, ఆ స్పష్టతను ట్రయల్ కోర్టుకు ఇవ్వండని ధర్మాసనం సూచించింది. కంగనా పంజాబ్కు వెళ్లే పరిస్థితి లేదని న్యాయవాది చెప్పగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరవచ్చని కోర్టు పేర్కొంది. న్యాయవాది మరేదో వాదన చేయబోతుండగా ‘ఆమె ట్వీట్పై మా స్పందన కోరే ప్రయత్నం చేయకండి’ అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన