
భారత్ పట్ల డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న కఠినమైన వైఖరిని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. వీరితోపాటు మాజీ ఉద్యోగులు కూడా తప్పుడు విధానాలను ఖండిస్తున్నారు. తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్, ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
రష్యా నుంచి భారీగా చమురు కొంటున్న చైనాపై ట్రంప్ సుంకాలు విధించకపోవటంతో, భారత్ తీవ్రంగా స్పందించిందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు. 50 శాతం సుంకాల కారణంగా భారత్- చైనా, రష్యాలతో జట్టు కట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మూడు దేశాలు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
అంతేకాదు చైనా పట్ల ట్రంప్ సానుకూలంగా వ్యవహరించడాన్ని అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతుందని స్పష్టం చేశారు. ట్రంప్ విధించిన అదనపు సుంకాలు రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లను నిలువరించలేకపోయాయని జాన్ బోల్టన్ గుర్తు చేశారు. పైగా భారత్ తన చమురు కొనుగోళ్లను గట్టిగా సమర్థించుకుందని చెప్పారు.
ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలు భవిష్యత్తులో అమెరికాకు ప్రతికూల ఫలితాలను తీసుకొస్తాయని జాన్ బోల్టన్ స్పష్టం చేశారు. సుంకాల కారణంగా అమెరికా-భారత్ మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ తెలిపారు. అమెరికా విశ్వసనీయతపైనా ప్రశ్నలు రేకెత్తించే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
More Stories
కాబూల్పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి