బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ, గాంగ్జూ మధ్య రెగ్యులర్ ప్యాసింజెర్ విమానాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఆ ప్రయాణాలు మొదలు కానున్నట్లు చైనా సదర్ ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ చైనా సదరన్ సర్వీసులను భారత్ లో ప్రారంభించనున్నారు.
ఈ పునఃప్రారంభంతో, దక్షిణాసియాలోని ఎనిమిది రౌండ్-ట్రిప్ మార్గాల్లో వారానికి 100కు పైగా విమానాలను నడపనున్నట్లు ఆ విమానయాన సంస్థ తెలిపింది. చైనాలోని దక్షిణ గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని గ్వాంగ్జౌలో ప్రధాన కార్యాలయం ఉన్న చైనా సదరన్ ఎయిర్లైన్స్, దేశంలోని ప్రధాన విమానయాన సంస్థలలో ఒకటి. 2020లో కరోనా మహమ్మారి కారణంగా భారత్, చైనాల మధ్య విమాన సేవలు నిలిపివేశారు.తూర్పు లడఖ్లో రెండు దేశాల మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగిన సైనిక ప్రతిష్టంభన (ఇది గత ఏడాది అక్టోబర్లో ముగిసింది) నేపథ్యంలో ఆ సేవలు తిరిగి పునరుద్ధరించలేదు.
2024, 2025లలో మోదీ, షీల మధ్య జరిగిన రెండు సమావేశాల అనంతరం భారత్-చైనా సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి రావడంలో భాగంగా ఈ విమానాల పునఃప్రారంభం జరిగింది. సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో, బీజింగ్-న్యూఢిల్లీ మార్గంతో సహా పలు చైనా, భారతీయ విమానయాన సంస్థలు ఇరు దేశాల నగరాల మధ్య విమాన సర్వీసులను పునఃప్రారంభించాయి.
ఈ ఏడాది మార్చిలో, ఇండిగో షాంఘై, కోల్కతాల మధ్య రోజువారీ విమాన సర్వీసును ప్రారంభించి, భారత్-చైనాల మధ్య వాయు అనుసంధానాన్ని మరింత మెరుగుపరిచింది. చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్ సంస్థ ఏప్రిల్ 18వ తేదీ నుంచి కునిమింగ్, కోల్కతా మధ్య సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

More Stories
బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య అవరోధాలు తొలగించాలి.. మోదీ పిలుపు
ముడి చమురు ధర 100 డాలర్లు దాటటంతో భారత్ ఆందోళన
`రైల్వే’ కుంభకోణంలో లాలూ, ఆయన భార్య, కుమారుడిపై అభియోగాలు