భారతదేశంలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచాలని చూస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచార సాంకేతిక (ఐటి) రూల్స్, 2021 స్థానంలో సరికొత్త కఠిన నిబంధనలను తీసుకురావడానికి కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం.
ప్రస్తుత విధానం ప్రకారం, ఓటీటీ కంటెంట్ను థియేటర్లలో విడుదలయ్యే సినిమాల మాదిరిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముందస్తుగా పరిశీలించి ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వదు. ఇదంతా ఐటీ రూల్స్, 2021 పరిధిలోని డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారమే నడుస్తోంది. దీనివల్ల ఆయా ప్లాట్ఫామ్లు తమ కంటెంట్ను వయస్సు ఆధారంగా విభజించి, కేవలం స్వీయ నియంత్రణ మాత్రమే పాటిస్తున్నాయి.
అయితే, ఇటీవల కొన్ని ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లలో మితిమీరిన బోల్డ్ సీన్లు, బూతులు, వివాదాస్పద రాజకీయ, సామాజికాంశాలు ఎక్కువవుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందాయి. తాజా ఉదాహరణగా, పంజాబీ నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ సినిమా నిలిచింది. ఈ చిత్రం థియేట్రికల్ విడుదల కోసం సెన్సార్ బోర్డ్ వద్దకు వెళ్లినప్పుడు ఏకంగా 120కి పైగా కట్స్ చెప్పారు.

More Stories
మైనర్ బాలికపై అత్యాచారం, హత్యలో అరెస్టులు 35కు పెరుగుదల
ఐదు రోజులకే కరిగిపోయిన మహా హిమశివలింగం
కర్ణాటక ఆలయాల్లోని విరాళాల పెట్టెలపై సీసీటీవీ నిఘా