నిరాహార దీక్షకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ధర్నా చౌక్కు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విశ్రాంత ఉద్యోగులు చేస్తున్న నినాదాలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు గళమెత్తారు. బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని చెబుతూ అసలు ఆయనకు తెలంగాణకు వచ్చే నైతిక అర్హతే కోల్పోయారని మండిపడ్డారు. ఎందుకంటే వాళ్ల పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పేదల ఇండ్లు కూలగొడుతున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు.
పేదల మీద, ఉద్యోగుల మీద, రైతుల మీద జరుగుతున్న ఈ దారుణమైన అణచివేతకు ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాలరాస్తూ, బలవంతపు కూల్చివేతలతో భయాందోళన సృష్టిస్తున్న ఈ కాంగ్రెస్ గడ్డపార రాజ్యాన్ని కూలగొట్టాల్సిందే అని తేల్చి చెప్పారు.

More Stories
ఖమ్మంలో వెలుగుమట్ల నిర్వాసితులపై లాఠీచార్జ్
కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఖమ్మం నుంచే నాంది
ఐఏఎస్ అర్వింద్ కుమార్ను సస్పెండ్