త్వ‌ర‌లో ఐఎన్ఎస్ అరిద‌మ‌న్ జ‌ల‌ప్ర‌వేశం

త్వ‌ర‌లో ఐఎన్ఎస్ అరిద‌మ‌న్ జ‌ల‌ప్ర‌వేశం

స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారీ అయిన అణ్వాయుధ సామ‌ర్థ్యం క‌లిగిన బాలిస్టిక్ జ‌లాంత‌ర్గామి ఐఎన్ఎస్ అరిద‌మ‌న్‌ ను త్వ‌ర‌లో జ‌ల‌ప్ర‌వేశం చేయ‌నున్న‌ట్లు నేవీ చీఫ్ అడ్మిర‌ల్ దినేశ్ కే త్రిపాఠి తెలిపారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  ప్రాజెక్ట్ 75 ఇండియా కింద ఆరు అత్యాధునిక స‌బ్‌మెరైన్ల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. త్వ‌ర‌లో కాంట్రాక్టు కుద‌ర‌నున్న‌ద‌ని తెలిపారు.

నావికాదళ పరిభాషలో ‘షిప్ సబ్‌మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్’ (ఎస్ఎస్ఎన్ బి) అని పిలువబడే భారతదేశం, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ అనే రెండు జలాంతర్గాములను ఇప్పటికే తనలో చేర్చుకుంది. ఇవి అణుశక్తితో నడిచే జలాంతర్గాములు, రోజుల తరబడి నీటిలో మునిగిపోగలవు. భారతదేశ అణు సిద్ధాంతం ‘మొదటి దాడి’ని తోసిపుచ్చుతుంది, అయితే, ప్రతీకార దాడి చేయడానికి వీటిని ఉత్తమ ఎంపికలుగా పరిగణిస్తున్నారు.

ఎస్ఎస్ఎన్ బి నుండి వేరుగా, భారతదేశం రష్యా నుండి అణుశక్తితో నడిచే దాడి జలాంతర్గామిని పొందాలని కూడా చూస్తోంది. ఇది అణుశక్తితో నడిచేది, కానీ అణు క్షిపణులను మోయదు. ఇది 2027 నాటికి భారతదేశానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి.  2029 నాటికి నేవీలోకి నాలుగు ర‌ఫేల్ యుద్ధ విమానాలు రానున్న‌ట్లు త్రిపాఠి చెప్పారు. గ‌త ఏడాది నేవీ డే నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ స‌బ్‌మెరైన్‌తో పాటు నేవీ షిప్‌ల‌ను క‌మీష‌న్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఐఎన్ఎస్ ఉద‌య్‌గిరిన త‌మకు చెందిన నేవీ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో మాక్ర‌న్ తీరం వ‌ద్ద పాకిస్థాన్ నేవీని ఐఎన్ఎస్ ఉద‌య్‌గిరి అడ్డుకున్న‌ట్లు చెప్పారు కాగా, గత మేలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ కొనసాగుతోందని, ఇది విజయవంతం అయిన కారణంగానే పాకిస్థాన్ నౌకాదళం వారి పోర్టులకే పరిమితం అయిందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఆపరేషన్ సింధూర్’ కేవలం సైనికపరంగానే కాకుండా పాకిస్థాన్‌కు ఆర్థికంగా కూడా నష్టం కలిగించినట్లు అడ్మిరల్ త్రిపాఠి వివరించారు. 

ఈ ఆపరేషన్ కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గణనీయమైన సంఖ్యలో వాణిజ్య నౌకలు పాకిస్థాన్‌కు ప్రయాణించడానికి నిరాకరించాయని చెప్పారు. అలాగే పాకిస్థాన్‌కు ప్రయాణించే నౌకల భీమా వ్యయం కూడా పెరిగిందని, ఇది పాక్ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారాన్ని మోపిందని తెలిపారు.  గత ఏడు నుంచి ఎనిమిది నెలలుగా పాకిస్థాన్‌తో నెలకొన్న శత్రుత్వాల నేపథ్యంలో భారత నౌకాదళం పశ్చిమ అరేబియా సముద్రంతో సహా అన్ని కీలక ప్రాంతాల్లో అధిక కార్యాచరణ సంసిద్ధతను నిర్వహించిందని అడ్మిరల్ త్రిపాఠి వెల్లడించారు. భారతదేశ భద్రతకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.