ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక హత్య!

ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక హత్య!
ఆడ బిడ్డలకు, అమ్మలకు ఇంట్లోనూ రక్షణ కరువైందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. దాదాపు ప్రతీ 10 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక కుటుంబసభ్యుల చేతిలో హత్యకు గురవుతున్నట్లు తేలింది. ఇలా సగటున ప్రతి రోజు 137 మంది హత్యకు గరువుతున్నారని ఆ నివేదిక పేర్కొంది.  మహిళలు, బాలికల హత్యలపై ఐక్యరాజ్యసమితి నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి.
ఈ మేరకు యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ (యుఎన్‌ఒడిసి), ఐరాస మహిళా విభాగం  ఒక నివేదికను విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది మహిళలు, బాలికలు ఈ రీతిన ప్రాణాలు కోల్పోతున్నారని నివేదిక వెల్లడించింది.
 
”గతేడాది 83 వేల మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. వీరిలో 60 శాతం అంటే 50,000 మంది మహిళలు, బాలికలు వారి సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లోనే హత్యకు గురయ్యారు. అంటే దాదాపు ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక, భాగస్వామి లేదా వారి కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోంది. దాదాపు సగటున ప్రతిరోజూ 137 మంది ఇలాగే మరణిస్తున్నారు” అని తెలిపింది. 
 
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు, బాలికలకు ఇల్లు అనేది ప్రమాదకరమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన ప్రదేశంగా మారిందని ఆ నివేదిక పేర్కొంది. మరోవైపు మహిళలపై ఆన్‌లైన్‌ హింస, వేధింపుల గురించి కూడా ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం డైరెక్టర్‌ సారా హెండ్రిక్స్‌ ప్రస్తావించారు. డిజిటల్‌ హింస అనేది ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉండదని, అది ఆఫ్‌లైన్‌లోనూ వ్యాపిస్తుందని అభిప్రాయపడ్డారు.

“గతేడాది 83,000 మంది మహిళలు, బాలికలు ఉద్దేశపూర్వకంగా హత్యకు గురయ్యారు. అందులో 60 శాతం అంటే 50,000 మంది మహిళలు, బాలికలు వారి సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లో హత్యకు గురయ్యారు. దీని అర్థం దాదాపు ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక భాగస్వామి వారి కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోంది” అని తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ బ్రాండోలినో తెలిపారు.

దాదాపు సగటున ప్రతిరోజూ 137 మంది మరణిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు, బాలికలకు ఇల్లు ప్రమాదకరమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన ప్రదేశంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  మరోవైపు మహిళలపై ఆన్‌లైన్ హింస ముప్పును ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం డైరెక్టర్ సారా హెండ్రిక్స్ ప్రస్తావించారు. డిజిటల్ హింస ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉండదని, అది ఆఫ్‌లైన్‌లోనూ వ్యాపిస్తుందని అభిప్రాయపడ్డారు.

అటు గతేడాది 11 శాతం పురుష హత్యలు సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యులతో జరిగాయని నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలోనే మహిళ హత్యకు వ్యతిరేకంగా మెరుగైన నివారణ చర్యలు, న్యాయం అందిచేలా చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. ఇవి తీవ్రమైన హింసను వ్యాప్తి చేసే పరిస్థితులకు కారణమవుతాయని హెచ్చరించింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో మహిళలు, బాలికలు తీవ్రమైన హింసకు గురవుతున్నారు. ముఖ్యంగా సన్నిహిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడి చేతిలో ఎక్కువగా హత్యకు గరవుతున్నారు. మహిళా హత్య రేటులో ప్రపంచంలో ప్రతి లక్ష మందిలో అత్యధికంగా ఆఫ్రికాలో (3), అమెరికాలో (1.5), ఓషియానియా (1.4), ఆసియా (0.7), యూరప్ (0.5)లో జరుగుతున్నాయని అంచనా వేశారు. 

ఇంకా బయటి వ్యక్తుల వల్ల కూడా మహిళ, బాలిక హత్యలు జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించిన డేటా పరిమితంగానే ఉందని తెలిపారు. 2024లో ప్రైవేట్ రంగంలో దాదాపు 50,000 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. అంతకుముందు 2023లో ఈ సంఖ్య 51,100గా ఉంది.