జులై 21వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, షెడ్యూల్ ప్రకారం ముగియడానికి ఒక రోజు ముందుగా ఆగస్టు 21వ తేదీన ముగిశాయి. లోక్సభ, రాజ్యసభ రెండు కూడా నిరవధికంగా వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాల్లో 21 రోజులపాటు సభలు నడిచాయి. బిహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణపై చర్చ కోసం ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో సెషన్ నిరంతరం అంతరాయం కలిగింది. పదే పదే వాయిదా పడటం వల్ల, లోక్సభ ఉత్పాదకత దాదాపు 31 శాతం ఉండగా, రాజ్యసభ ఉత్పాదకత దాదాపు 39 శాతంగా ఉంది.
అదే సమయంలో పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో 14 బిల్లులు ప్రవేశపెట్టగా, 12 బిల్లులు దిగువ సభ, 15 బిల్లులు ఎగువ సభ ఆమోదించాయి. “మొత్తంగా, 15 బిల్లులు పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఆమోదం పొందాయి. ఒక బిల్లును లోక్సభ నుంచి కేంద్రం ఉపసంహరించుకుంది” అని పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

More Stories
ఉధంపూర్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
పెల్లెట్ గన్ వాడకంపై దర్యాప్తు కమిటీ మార్పుకు సుప్రీం నిరాకరణ
భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ‘యుద్ధ అభ్యాస్’