“సాధారణ వ్యక్తిగా చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన మరో శీష్ మహల్ ఇది” అంటూ బీజేపీ ఆ ట్వీట్లో పేర్కొంది. ఢిల్లీ ‘శీష్ మహల్’ను ఖాళీ చేసిన తర్వాత పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతున్న కేజ్రీవాల్కు అంతకంటే ఖరీదైన, విశాలమైన శీష్ మహల్ను ఛండీగఢ్లోని సెక్టార్-2లో నిర్మించారని తెలిపింది.
బిజెపి నాయకుల అభిప్రాయం ప్రకారం, ఆప్ అధినేతకు చండీగఢ్లోని సెక్టార్ 2లో రెండు ఎకరాల విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాను కేటాయించారు, దీనిని ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం అందించింది. పార్టీ వర్గాలు ఈ నివాసాన్ని “సెవెన్-స్టార్” సౌకర్యంగా, `సరికొత్త రాయల్ ప్యాలస్’గా అభివర్ణించాయి. ప్రస్తుతం ప్రభుత్వ పదవి లేని రాజకీయ నాయకుడికి ఇంత సంపన్నమైన ఆస్తి ఎలా దక్కుతుందని ప్రశ్నించారు.
పంజాబ్ కు కేజ్రీవాల్ `సూపర్ సీఎం’గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చండీగఢ్ సెక్టార్ -2లో రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఏడు నక్షత్రాల ప్రభుత్వ భవనాన్ని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కోటాలో ఆయనకు కేటాయించినట్లు పేర్కొంది. కాగా, ఈ ఫోటోను ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పంచుకోవడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
గత ఏడాది మేలో స్వాతి మాలివాల్, కేజ్రీవాల్ మధ్య సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. ” ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి “పంజాబ్లో షీష్ మహల్ను నిర్మించారు, ఇది ఢిల్లీ కంటే చాలా అద్భుతంగా ఉంది” అని మలివాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ సౌకర్యాన్ని కాపాడుకోవడానికి, అతని ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించింది.
“ఢిల్లీలోని షీష్ మహల్ ఖాళీ చేయబడిన తర్వాత, అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో షీష్ మహల్ను నిర్మించారు, ఇది ఢిల్లీ కంటే చాలా అద్భుతంగా ఉంది” అని ఆమె రాశారు. పంజాబ్ ప్రభుత్వం కేజ్రీవాల్ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర యంత్రాంగాన్ని మళ్లించిందని మలివాల్ పేర్కొన్నారు. పార్టీ పని కోసం మాజీ ముఖ్యమంత్రి ఇటీవల అంబాలా నుండి గుజరాత్కు చేసిన పర్యటన కోసం ప్రభుత్వ హెలికాప్టర్ను, తరువాత పంజాబ్ ప్రభుత్వ ప్రైవేట్ జెట్ను ఉపయోగించారని ఆమె ఆరోపించారు.
“మొత్తం పంజాబ్ ప్రభుత్వం ఒక వ్యక్తికి సేవ చేయడంలో బిజీగా ఉంది” అని ఆమె ఎద్దేవా చేశారు. జాతీయ కన్వీనర్కు అనుగుణంగా రాష్ట్ర ప్రాధాన్యతలను రాజీ పడుతున్నారని అంటూ ఆమె ధ్వజమెత్తారు.
డిల్లీలో నిర్మించిన అద్దాల మేడ నుంచి కేజ్రీవాల్ను అక్కడ ప్రజలు తరిమేశారని, కానీ అద్దాల మేడ కాన్సెప్ట్ అనేది ఆయన మెదడు నుంచి పోలేదని, అద్దాలమేడ రెండో భాగం పంజాబ్లో జరుగుతున్నదని, ఆ రాష్ట్ర ప్రజల పన్నులతో దాన్ని నిర్మిస్తున్నారని, అది కూడా సీఎం కోటాలో ఆ పనులు జరుగుతున్నాయని, ఎందుకంటే పంజాబ్కు సూపర్ సీఎం కేజ్రీవాల్ అని బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. పంజాబీ పన్నుదారుల సొమ్ముతో కేజ్రీకి మేడలు కడుతున్నారని విమర్శించారు
మరోవైపు బీజేపీ చేస్తున్న విమర్శలపై అమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కు ఇల్లు కేటాయించారంటూ బోగస్ ప్రచారం చేస్తున్నారని తిప్పికొట్టింది. కేటాయించినట్లు అలాట్మెంట్ ఆర్డర్ ఎక్కడ ఉందని ప్రశ్నించింది. బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేక్ యమూనా స్టోరీ బయటపెట్టిన నాటి నుంచి బీజేపీ ఆందోళన చెందుతుందని ఎద్దేవా చేసింది.
ఢిల్లీలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లోని బంగ్లాను కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు రూ.45 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నిర్మించారంటూ బీజేపీ అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిని అసెంబ్లీ ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా మార్చుకుంది. ఈ ప్రచారం ఆప్ విజయావకాశాలను గండికొట్టింది. ఢిల్లీలోని శీష్ మహల్ను గెస్ట్ హౌస్గా కన్వర్ట్ చేస్తామని ఢిల్లీ బీజేపీ సర్కార్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.

More Stories
కశ్మీర్ ఆసుపత్రుల కింద ఆయుధ డంప్కు కుట్రలు
భాగస్వామి హింసకు గురవుతున్న ఐదోవంతు మహిళలు
దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్