
“హిందూ ధర్మంపై షర్మిల వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆ వ్యాఖ్యలు ఆమె సొంత విధానమా? లేక కాంగ్రెస్ పార్టీ విధానమో స్పష్టం చేయాలి. మతమార్పిళ్లు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వారికి దేవాలయాల నిర్మాణం నచ్చకపోవడమనేది ఆశ్యర్యాన్ని కలిగించడం లేదు. తిరుమల శ్రీవెంకటేశ్వరుని విరాళాల సొమ్ము దోచుకున్నప్పుడు సైలెంట్గా ఉన్న షర్మిల ఇప్పుడు దేవాలయాల నిర్మాణాలపై మాత్రం తెగ విమర్శలు చేస్తున్నారు” అంటూ మంత్రి ఆనం విమర్శించారు.
“రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో దళిత, గిరిజన కాలనీల్లో 5,000 ఆలయాలను నిర్మించనున్నాం. వీటికి అవసరమైన నిధులను ప్రజల నుంచే విరాళాలుగా సేకరించనున్నాం” అని మంత్రి ఆనం తెలిపారు. నవంబరులో వెయ్యి ఆలయాల విస్తరణాభివృద్ధి పనులు చేపడుతున్నామని, 926 దేవాలయాల్లో పాలకవర్గాలఏర్పాటుకు నోటిఫికేషన్లు జారీ చేశామని మంత్రి తెలిపారు.
దళితవాడల్లో ఆలయాలు వద్దా?
కాగా, తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించిన ముడుపులతో దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తే క్రైస్తవ మతాన్ని ఆచరించే పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఇబ్బంది ఎంటి? అని బీజేపీ నేత వల్లూరు జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. ‘తిరుమల కొండపై ఆమె కుటుంబం ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంది. ఏడు కొండలు కాదన్న తండ్రి, లడ్డూను కల్తీ చేయించిన అన్న, దళిత వాడల్లో ఆలయాలే వద్దంటోన్న చెల్లి. హిందూ దళితులున్న కాలనీల్లో చర్చిల నిర్మాణంపైనా షర్మిల ఇలాగే స్పందిస్తారా?’ అంటూ వల్లూరు నిలదీశారు.
More Stories
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ
షర్మిల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా?
హైందవ ధర్మంపై వైఎస్ కుటుంభం నిరంతర దాడి