
దేశంలోని ప్రతి పౌరుడికి లబ్ధి జరిగేలా జీఎస్టీ సంస్కణరణలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పన్నుల భారం తగ్గడం ద్వారా ప్రజలకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేస్తాయని, జీఎస్టీ సంస్కరణల్లో ఒక దానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించినట్లు పవన్ తెలిపారు. సంస్కరణలను ముందుండి నడిపిన నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయమని, రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని చెప్పుకొచ్చారు.
చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. జీఎస్టీ పన్ను విధానం సులభతరం ద్వారా ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని, వ్యాపారులపై పన్నుల భారం తగ్గి, పన్నుల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల పొదుపు పెంచి, కొనుగోలు శక్తి పెంపొందించేందుకు దోహదం చేస్తుందని చెప్పారు.
స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి ఈ సంస్కరణలు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు పెంచి, ఆర్థిక వృద్ధికి దారి తీస్తుందని పవన్ వెల్లడించారు. జీఎస్టీ మార్పులను స్వాగతిస్తూ అసెంబ్లీలో చర్చకు ముగింపుగా ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తీర్మానం ప్రతిపాదించారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబును అభినందిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది
More Stories
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం
టిటిడిపై మరో వివాదంలో మాజీ చైర్మన్ భూమన