ఆగస్టులో 6.5 శాతం పెరిగిన జిఎస్‌టి వసూళ్లు

ఆగస్టులో 6.5 శాతం పెరిగిన జిఎస్‌టి వసూళ్లు
కాగా, ఆంధ్రప్రదేశ్‌ జీఎస్టీ వసూళ్లు  గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 21 శాతం వృద్ధి సాధించింది. దేశ సగటు వృద్ధి (10%) కంటే రెట్టింపు స్థాయిలో ఇది నమోదవడం విశేషం. 2024 ఆగస్టులో రాష్ట్రానికి రూ.3,298 కోట్లు రాగా, 2025 ఆగస్టులో రూ.3,989 కోట్ల రాబడి లభించింది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధిక రాబడి సాధించిన నెలగా నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే (సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, అండమాన్‌ కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా) ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.

మొత్తంగా చూస్తే, 2017 నుంచి 2025 వరకు ఆంధ్రప్రదేశ్‌ వస్తు సేవల పన్ను వసూళ్లు నిరంతర వృద్ధి దిశగా సాగాయి. మధ్యలో కొన్ని సంవత్సరాల్లో స్వల్ప తగ్గుదల కనిపించినా, 2025లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. జీఎస్టీతో పాటు వృత్తి పన్ను, ఇంధన రంగం కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.