దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నీటిమట్టం పెరగడంతో నార చీరల ప్రాంతం వరదనీటిలో మునిగింది. చర్ల మండలంలోని తాలుపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వచ్చి చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టు వద్ద 8 గేట్లను ఎత్తి అధికారులు 10 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు.
గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో మత్స్యకారులు గోదావరి పరివాహక ప్రాంతం వద్దకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నది పరిహహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలని, అధికారుల సూచనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

More Stories
మూసీ గోస… బీజేపీ భరోసా పరామర్శ యాత్ర
రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు
నేపాల్లో తలదాచుకుంటున్న గణపతి!