
* ఆగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవం
భారత్లో ఆసియా సింహాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదేళ్లల్లో 32.2శాతం వృద్ధి నమోదైంది. 2020లో 674గా ఉన్న వాటి సంఖ్య 2025 నాటికి 891కి పెరిగింది. ఆగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా విడుదలైన 16వ సింహాల జనాభా అంచనా నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, ఆడ సింహాల సంఖ్యలో 26.9శాతం పెరగుదల కనిపించింది. వాటి సంఖ్య 260 నుంచి 330కి పెరిగింది. ఇది సింహాల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
గత పది సంవత్సరాలలో సింహాల జనాభా 70.36 శాతం వృద్ధి సాధించింది. 2015లో 523 ఉండగా, 2025లో 891కి పెరిగాయి. వాటి విస్తీర్ణం కూడా 59.09 శాతం పెరిగింది. తొలిసారిగా కారిడార్ ప్రాంతాల్లోనూ సింహాలను కనిపించాయి. వాటి సంఖ్య 22 అని నివేదికలో పేర్కొంది.
ఆసియా సింహాలకు భారత్ నిలయంగా ఉండటం మనకు గర్వకారణమని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మన సింహాల జనాభా క్రమంగా పెరుగుతోందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. 2015లో 523 సింహాలు ఉన్నాయి. 2025 నాటిని వాటి సంఖ్య 891కి పెరగడం అద్భుతమైన విజయం.
“మన సింహాలను రక్షించి, వాటి వృద్ధికి సహాయం చేయడానికి కలిసి పనిచేద్దాం. వాటి సంరక్షణ పట్ల ఆసక్తి కలిగిన వారందరికీ ప్రపంచ సింహ దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యధికంగా సింహాలు అమ్రేలీ జిల్లాలోనే ఉన్నాయి. పెద్ద వయసు గల మగ సింహాలు 82, ఆడ సింహాలు 117 ఉన్నాయి. అలాగే పిల్ల సింహాలు 79 ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే మిటియాలా వన్యప్రాణి అభయారణ్యం, దాని సమీప ప్రాంతాల్లో 100 శాతం వృద్ధి సాధించాయి.
ఆ తర్వాత భావ్నగర్ ప్రధాన భూభాగం 84 శాతం, ఆగ్నేయ తీరం 40 శాతం ఉన్నారు. అయితే, గిర్నార్ వన్యప్రాణి అభయారణ్యంలో 4% తగ్గుదల, భావ్నగర్ తీర ప్రాంతంలో 12% తగ్గుదల నమోదైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమానికి లోగోగా ఆసియా సింహం ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. పరిరక్షణ ప్రయత్నాలకు అనుగుణంగా, అటవీ శాఖ సింహాల ఆవాసాలను విస్తరించాలని నిర్ణయించింది. సింహాలకు ప్రత్యామ్నాయ స్వర్గధామంగా బర్దా అభయారణ్యం అభివృద్ధి గత సంవత్సరం నుండి జరుగుతోంది.
ఈ ఏడాది థీమ్ ప్రపంచవ్యాప్తంగా సింహాల సంరక్షణ, రక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యం. గుజరాత్లోని ఆసియా సింహం సౌరాష్ట్ర ప్రాంతంలో మాత్రమే కనిపించే ప్రత్యేక పర్యావరణ–సాంస్కృతిక ఆభరణం ఇది. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం ప్రాజెక్ట్ లయన్ కింద తీసుకున్న చర్యలు సింహాల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించాయి.
గత ఐదు సంవత్సరాలలో, సింహాలు తమ పరిధిని 17%, 30,000 నుండి 35,000 చదరపు కిలోమీటర్ల భూభాగంకు విస్తరించాయి . ఇప్పుడు 11యి జిల్లాల్లోని 58 తాలూకాలకు (2020లో 53 నుండి) విస్తరించాయి. అయితే, 15 సంవత్సరాలలో, సింహం మరోసారి దాని పరిధిని 13,000 చదరపు కిలోమీటర్ల నుండి 30,000 చదరపు కిలోమీటర్లకు రెట్టింపు చేయడంతో, ఇప్పటికే స్థాపించిన ఉపగ్రహ జనాభా సింహాల సంఖ్య 359 నుండి 674కి 88% పెరిగి రికార్డు సృష్టించింది.
More Stories
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు