
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారత్లో భారీ దాడులకు ప్లాన్ చేసింది. అయితే అల్ ఖైదా కుట్రను గుజరాత్ కు చెందిన ఏటీఎస్ పోలీసులు భగ్నం చేశారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరిని గుజరాత్లో అరెస్ట్ చేయగా, ఒకరిని ఢిల్లీలో, మరొకరిని నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచారు. ఫలితంగా ఇప్పటికే పలు ఉగ్రకుట్రలు భగ్నం అయ్యాయి. తాజాగా మరో నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదులను మహమ్మద్ ఫైక్, మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని అధికారులు విచారిస్తున్నారు.
వీరంతా 20-25 ఏళ్ల లోపు వారేనని, దేశంలో భారీ కుట్రలకు వీరు ప్లాన్ చేశారని గుజరాత్ పోలీసులు తెలిపారు. వీరు సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు సంబంధాలు నెరపుతున్నట్టు గుర్తించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, ఢిల్లీ పోలీసులు సైతం గతేడాది ఆగస్టులో అల్ఖైధా అనుబంధ టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు చేశారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 14 మందిని అరెస్టు చేశారు. వీరికి వివిధ రకాల ఆయుధాల వాడకంలో శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు.
More Stories
భారతీయ సినిమాలంటే ఎంతో ఇష్టం.. పుతిన్
రాబోయే ఐదేళ్లలో నంబర్-1గా భారత ఆటోమొబైల్ పరిశ్రమ
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!