బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’పై ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి. ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రాన్ని ఏకంగా రూ.4000 కోట్ల భారీ వ్యయంతో రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో ఇదంతటి భారీ బడ్జెట్ పెట్టుబడి ఎక్కడా లేనిదని చెప్పారు.
“‘రామాయణ’ను చరిత్రలో నిలిచేలా రూపొందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ఏ ఒక్కరి దగ్గరా డబ్బులు తీసుకోకుండా మా సొంత నిధులతో నిర్మాణం చేపడతాం. ఈ ప్రాజెక్ట్ ఆలోచన ఏడేళ్ల క్రితమే మొదలైంది. అయితే కరోనా అనంతరం మొదలుపెట్టినపుడు నన్ను పిచ్చివాడిగా భావించారు” అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్కి సమానమైనది భారతీయ సినిమా పరిశ్రమలో లేదని పేర్కొంటూ ప్రపంచం మొత్తానికి భారతీయ సంస్కతి గొప్పతనాన్ని చూపించాలనే లక్ష్యంతో తాము ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నమిత్ తెలిపారు.
ఈ సినిమా బడ్జెట్పై ఇప్పటికే అనేక ఊహాగానాలు వెల్లివిరిచాయి. మొదట రూ.835 కోట్లు, ఆపై రూ.1600 కోట్లు, మొదటి భాగానికి రూ.900 కోట్లు, రెండో భాగానికి రూ.700 కోట్లు ఖర్చవుతుందంటూ కథనాలచ్చాయి. ఇప్పుడు నిర్మాత నమిత్ మల్హోత్రానే అధికారికంగా రూ.4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పడం వైరల్గా మారింది.
రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా, రకుల్ ప్రీత్సింగ్ శూర్పణఖగా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేయాలని నిర్మాణ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. హాలీవుడ్ సినిమాలకన్నా తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి నాణ్యతతో ఈ చిత్రాన్ని తీయగలమని నమ్మకం ఉందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.

More Stories
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
కుటుంభం కోసం కాదు.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేశా!
కేరళలో ముస్లింలకు 10 శాతం, క్రిస్టియన్లకు 6 శాతం రిజర్వేషన్లు