
పహల్గాంలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల గురించి చెబుతూ, ‘భారతీయుల రక్తాన్ని చిందించిన ఉగ్రవాదులు ఎక్కడా దాక్కున్నా, అవి వారికి ఏమాత్రం సురక్షితం కాదని మేము నిరూపించాం’ అని ప్రధాని మోదీ చెప్పారు. ఎలాంటి వివక్షతలు లేని బలమైన భారతదేశాన్ని కోరుకున్న గౌరవీయులైన వ్యక్తుల ఆదర్శాలపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
గత 11 ఏళ్లుగా తమ ప్రభుత్వం భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక, రక్షణ రంగాల్లో బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. భారతదేశం తన రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడడం క్రమంగా తగ్గుతోందని చెబుతూ భారత్ స్వయంగా తన దేశీయంగా ఆయుధాలు తయారు చేస్తూ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్గా మారుతోందని ఆయన స్పష్టం చేశారు.
:పహల్గామ్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన తరువాత, భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు వాడిన భారత సైన్యం కేవలం 22 నిమిషాల్లోనే శత్రువులు మోకరిల్లేరా చేసింది” అని మోదీ తెలిపారు.
అంతేకాదు భవిష్యత్లో ప్రపంచవ్యాప్తంగా మేడిన్ ఇండియా ఆయుధాలు వాడే రోజు వస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. సమాజంలో అణగారిన, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం తమ ప్రభుత్వం గృహనిర్మాణం, తాగు నీరు, ఆరోగ్య బీమా మొదలైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని మోదీ చెప్పారు. గతంలో కంటే, తాము అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో ఎక్కువ సంఖ్యలో ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ను ప్రారంభించామని ప్రధాని వివరించారు.
More Stories
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది