
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు ఉన్న మాట వాస్తమేనని, ఆయనను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. జస్టిస్ వర్మ నివసిస్తున్న తుగ్లక్ క్రీసెంట్లోని అధికారిక గృహంలో మార్చి 14 రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక, పోలీసులకు ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్లో పెద్దయెత్తున నోట్ల కట్టలు కన్పించాయి. అందులో
తనపై కుట్ర జరిగిందన్న జస్టిస్ వర్మ వాదనను కమిటీ తోసిపుచ్చింది. సిట్టింగ్ జడ్జి నివాస ప్రాంగణంలో అక్రమంగా నగదును ఉంచడం అసాధ్యమని పేర్కొంది. వాస్తవంగా కుట్ర అయితే ఢిల్లీ నుండి బదిలీని ఎందుకు అంగీకరించారని నిలదీసింది. జస్టిస్ వర్మ నివాస గృహంలో పెద్దయెత్తున నోట్ల కట్టలు ఉన్నట్టు పలువురు ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేశారని, దీనికి దృశ్య ఆధారాలు కూడా ఉన్నాయని కమిటీ తెలిపింది.
కానీ జస్టిస్ వర్మ ఎప్పుడూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ, న్యాయశాఖ అధికారులకు తెలియజేయడం కానీ చేయలేదని విచారణ కమిటీ పేర్కొంది. ఈ విషయంలో జస్టిస్ వర్మ ప్రవర్తన అసహజంగా ఉందని పేర్కొంటూ ఆయనను విధుల నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. కాగా, జస్టిస్ వర్మను అభిశంసించే విషయంపై ఏకాభిప్రాయ సాధన కోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. సిట్టింగ్ జడ్జిని బలవంతంగా పదవి నుండి తొలగించడం ఇదే మొదటిసారి అవుతుంది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు