
రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చాలని కేంద్ర విమానయాన శాఖకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ తీర్మానాలను ఆయన మీడియాకు వివరిస్తూ రేణిగుంట విమానశ్రయానికి ఆధ్యాత్మిక శోభ తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సీఎస్ఆర్ ల్యాబ్ ద్వారా నెయ్యి, పప్పు ధాన్యాలు నాణ్యత పరిశీలన సులభతరమవుతుందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సమరసత ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లోని విద్యార్థులకు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు.
టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వడానికి మన వారసత్వం కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21న యోగా డే సందర్బంగా టీటీడీ పరిపాలనా భవన మైదానంలో యోగా కార్యక్రమం చేపడుతున్నామని బీఆర్ నాయుడు తెలియజేశారు.
“తిరుపతిలో సీఎస్ఐఆర్ ల్యాబ్ ఏర్పాటవుతుంది. ల్యాబ్ ద్వారా నెయ్యి, పప్పు ధాన్యాల నాణ్యత పరిశీలించవచ్చు. లీజు పద్ధతిలో ల్యాబ్కు స్థలం కేటాయించాలని నిర్ణయించాం. తిరుపతి విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభ తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సమరసత్తా ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని బిఆర్ నాయుడు వివరించారు.
More Stories
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం
టిటిడిపై మరో వివాదంలో మాజీ చైర్మన్ భూమన