
కాగా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ను ఇరాన్ ప్రారంభించింది. టెల్ అవీవ్, జెరూసలేంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఆయా ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసింది. దీంతో రెండు నగరాల్లో పలుచోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, సుమారు 34 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్లోని డజన్లకొద్దీ లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.
ఇరాన్ అణు ముప్పును నిర్మూలించడం తమకు తప్పనిసరి అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకే ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించామని తెలిపారు. ఇందుకు తమకు ఒక ఏడాది లేదా కొన్ని నెలలు పట్టవచ్చు అని చెప్పారు. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ అణు కార్యక్రమం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. అందుకే ఆ దేశ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని చెప్పారు.
తన యుద్ధం ఇరాన్ ప్రజలతో కాదని పేర్కొన్నారు. ‘గత 46 ఏండ్లుగా మిమ్ములను తొక్కి ఉంచుతున్న క్రూర నియంతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మీ విమోచన దినం దగ్గరలోనే ఉంది’ అని తెలిపారు. ఏడాది కాలంగా ఇజ్రాయెల్ ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థపై దాడులు చేస్తున్నది. గత ఏడాది ఏప్రిల్లో రష్యన్ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. అక్టోబర్లో క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసింది.
ఇలా ఉండగా, అమెరికాతో జరుగుతున్న అణు చర్చల నుంచి వైదొలగుతున్నామని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేసిందని, దానికి కఠిన శిక్ష విధిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ తన క్రూరమైన, రక్తసిక్తమైన హస్తాన్ని ఇరాన్లో నేరాలకు పాల్పడేందుకు చాచిందని విమర్శించారు.
More Stories
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్