
మంగళవారం నిర్వహించాల్సిన ప్రయోగం ఒకవేళ వాయిదా పడితే, ఈ నెల 11న సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మరో అవకాశం ఉన్నట్లు స్పేస్ఎక్స్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో బుధవారం ఈ ప్రయోగం చేపట్టనున్నారు. యాక్సియం-4 పేరుతో చేపట్టిన ఈ యాత్రలో శుభాంశు మిషన్ పైలట్గా వ్యవహరిస్తారు.
28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాన్షు శుక్లా సహా మరో మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపు (హంగరీ), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ- విస్నియెస్కీ (పోలండ్)లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పయనం కానున్నారు. ఈ మిషన్ 14 రోజుల పాటు కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆక్సియమ్ 4 మిషన్లో భారత్, పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములు ఉన్నారు. ఈ మిషన్ను నాసా, ఇస్రో సంయుక్తంగా చేపడుతున్నాయి.
1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదసి యానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత భారత పౌరుడొకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. వాస్తవానికి యాక్సియం-4 మిషన్ కోసం వీరు గత నెల 29నే నింగిలోకి పయనం కావాల్సింది. అయితే, దాన్ని తొలుత ఈ నెల 8కి, అనంతరం 10కి మార్చారు. తాజాగా మరోసారి వాయిదా పడింది. శుక్లా అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది.
More Stories
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు
విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన