* పరారీలో ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి
పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కలకత్తా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000 పూచీకత్తు(బెయిల్ బాండ్) సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ‘లా’ విద్యార్థిని అయిన 22 ఏళ్ల శర్మిష్టని కోల్కతా పోలీసులు గత వారం గుర్గాంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమెను కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వారం ప్రారంభంలో కోర్టు పనోలికి మధ్యంతర బెయిల్ నిరాకరించింది. ‘చూడండి, మనకు వాక్ స్వాతంత్ర్యం ఉంది. కానీ దాని అర్థం మీరు ఇతరులను బాధపెట్టడానికి కాదు. మన దేశం వైవిధ్యమైనది, వివిధ కులాలు, మతాలు, మతాలకు చెందిన వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేసేప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి’. అని జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ తెలిపారు.

More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
ప్రజాస్వామ్యంలో పెరిగిపోతున్న వర్గ రాజకీయాలు
400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!