పంజాబ్లోని అమృత్సర్ మజితా రోడ్ బైపాస్ వద్ద ఖాళీ ప్రదేశంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అనుమానిత ఖలిస్తానీ ఉగ్రవాది మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఉగ్రవాదికి రెండు చేతులు విరిగి ముక్కలుగా పడిపోయాయి.
ఈ ఘటనపై డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (సరిహద్దు పరిధి) సతిందర్ సింగ్ మాట్లాడుతూ ‘ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తికి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమాలున్నాయి. నిర్జన ప్రదేశంలో ఆ వ్యక్తి తన దగ్గరున్న పేలుడు పదార్థాల్ని తీసే క్రమంలో పేలుడు పదార్థం పేలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు’ అని తెలిపారు.
ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి రెండు చేతులు ముక్కలు ముక్కలుగా పడిపోయాయి. మృతి చెందిన ఈ వ్యక్తి ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడనే విషయం తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి పలానా అని గుర్తించనప్పటికీ అతని పాకెట్ జేబులో లభించిన కొన్ని కీలక ఆధారాలనుబట్టి అతను ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
ఇది ఐఇడి (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్) పేలుడునా లేదా గ్రెనేడ్ పేలుడునా అని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ సైన్స్ బృందం లాబొరేటరీ బృందం దర్యాప్తు చేస్తోంది అని సతిందర్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించడతో భయాందోళనలకు గురయ్యామని స్థానికులు తెలిపారు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని డిఐజి సతిందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.

More Stories
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు
న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయలేవు
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా