
తద్వారా సింధు నది జలాల విషయంలో భారత్ అనుసరించనున్న వైఖరిని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్కు వెళ్లే సింధూ నదీ జలాలను అడ్డుకుంది. దీంతో ఇప్పటికే సాగు, తాగు నీరు లేక అల్లాడుతున్న పాక్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల ఉద్రిక్త పరిస్థితుల వేళ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు.
గతంలో భారత జలాలు బయటి దేశాలకు వెళ్లేవని, ఇప్పుడు మన దేశంలో ప్రవహించే నీరంతా మన దేశంలోనే ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. మన దేశంలో ప్రహించే నీటిని మన దేశ అవసరాలకే వాడుకుందామని పాకిస్తాన్ను ఉద్దేశించి పరోక్షంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశంలోని జలాలను దేశీయ అవసరాలకే వినియోగిస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలోనే “మన దేశం- మన నీళ్లు- మన హక్కు” అనే నినాదాన్ని వినిపించారు.
తమ ప్రభుత్వం గత పదేళ్లలో దేశ ప్రయోజనాల కోసం అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుందని, కానీ గత ప్రభుత్వాలు ఈ విధంగా దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేశాయని ప్రధాని విమర్శించారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రపంచం ఏం ఆలోచిస్తోందో అని ప్రజలు యోచిస్తుంటారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు తాము ఓట్లు పొందగలుగుతామా లేదా తమ పదవి పదిలమా లేదా అని ఆలోచించేవని, అందువల్లనే ముఖ్యమైన సంస్కరణలు ఆలస్యమయ్యేవని విమర్శించారు. ఈ విధంగా ఏదేశం ముందుకు వెళ్లలేదని ప్రధాని పేర్కొన్నారు.
More Stories
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా