పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో సహా అనేక మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్తో బ్లాక్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత కీలక చర్యలు తీసుకున్నారు. షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ అకౌంట్లను నిషేధించారు.
భారత్ ఇప్పటికే ప్రముఖ పాకిస్తాన్ అథ్లెట్స్, క్రికెటర్లు, నటీనటులకు చెందిన యూట్యూబ్ చానెల్స్, ఇన్స్టా అకౌంట్లను బ్లాక్ చేసింది. ఒలింపిక్ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఇన్స్టాగ్రామ్ గురువారం బ్లాక్ అయ్యింది. తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ల అకౌంట్లు సైతం బ్యాన్ అయ్యాయి. బాబర్, రిజ్వాన్తో సహా ఈ ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా `ఈ అకౌంట్ భారత్లో అందుబాటులో లేదు’ అనే సందేశాన్ని చూపిస్తున్నది.
రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన కంటెంట్ను వ్యాప్తి చేసే అనేక మంది పాకిస్తానీల యూట్యూబ్ ఛానెల్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరొందిన షోయబ్ అక్తర్, (@ShoaibAkhtar100mph), పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాసిత్ అలీ యూట్యూబ్ ఛానెల్ ‘బాసిత్ అలీ’ (@BasitAliShow), పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్, సీనియర్ జర్నలిస్ట్ నౌమాన్ నియాజ్ యూట్యూబ్ ఛానెల్ ‘కాట్ బిహైండ్’, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ యూట్యూబ్ ఛానెల్ ‘తన్వీర్ సేస్’ (@Tanveer Says) చానెల్స్ ఉన్నాయి.

More Stories
చాబహార్ పోర్ట్పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు
ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్పింగ్ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు