
ఈ ఆరోపణలపై శివకుమార్ స్పందిస్తూ కాంట్రాక్లర్లు ఫిర్యాదు నమోదు చేయాలని కోరగా బోస్రాజు, సతీష్ వీటిని ఖండించారు. ప్రభుత్వంకు గాని లేదా లోకాయుక్తకు గాని ఫిర్యాదు చేస్తే వీటిపై దర్యాప్తు జరిపిస్తామని శివకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన సౌధలో జరిగిన ఓ కార్యక్రమంలో ముడుపులు, దళారులకు వ్యతిరేకంగా మాట్లాడిన రోజే కేఎస్సీఏ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
అవినీతిలో కర్ణాటక దేశంలోనే నంబర్ వన్ అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన 48 గంటల్లోనే ఏకంగా రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం సీనియర్ మంత్రులపై అవినీతి ఆరోపణలు గుప్పించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
పైగా, `అదృశ్య హస్తాలు’ గత మూడు, నాలుగు నెలలుగా ప్రభుత్వంలో వ్యవస్థను కలుషితం చేస్తున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరో ఇద్దరు మంత్రులకు మంజునాథ్ ఇటీవల లేఖలు వ్రాసారు. పెండింగ్ బిల్లుల కోసం దళారులపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులతో సగమైనా రూ 15,000 కోట్ల మేరకు చెల్లించాలని ముఖ్యమంత్రిని కోరారు.
More Stories
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి
నవంబర్ 22లోగా బీహార్ ఎన్నికలు
స్వతంత్ర దర్యాప్తు జరిపేవరకు జైల్లోనే ఉంటా