 
                “అంధకారం అస్తమిస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది”.. సరిగ్గా 45 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అటల్ బిహారి వాజ్ పేయి ప్రసంగంలో మాటలు ఇవి. 1980, ఏప్రిల్ 6న అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్ కె అద్వాని ఆధ్వర్యంలో బీజేపీ అవతరించింది. అప్పుడు ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది.
“ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల కృషి వల్ల ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. దేశంలో మూడు పర్యాయాలుగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు చెబుతున్నా” అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.





More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు