
తూర్పు వైపున అసోంలోని ‘బోగీబీల్ వంతెన’ కనిపిస్తుందని, దక్షిణాదికి వస్తే ప్రపంచంలోని కొన్ని నిలువు లిఫ్ట్ బ్రిడ్జిలలో ఒకటైన ‘పంబన్ వంతెన’ నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో తమిళనాడుది పెద్ద పాత్ర అని చెబుతూ తమిళనాడు బలం ఎంతగా పెరుగుతుందో భారత్ అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తాను నమ్ముతున్నానని తెలిపారు.
గత దశాబ్ద కాలంలో 2014 కంటే మూడు రెట్లు అధికంగా తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రధాని చెప్పారు. అయినప్పటికీ కారణం లేకుండా ఏడవడం కొందరికి అలవాటని పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విసుర్లు విసిరారు. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ సంవత్సరం తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6 వేల కోట్లకుపైగా కేటాయించారని గుర్తు చేశారు.
భారత ప్రభుత్వం ఇక్కడ 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందని, ఇందులో రామేశ్వరం రైల్వేస్టేషన్ సైతం ఉందని చెప్పారు. పంబన్ వంతెన దేశవ్యాప్తంగా వాణిజ్యం, ఆర్థిక వృద్ధి పెరగడానికి దోహదపడుతుందని, తమిళనాడులో పర్యటకాభివృద్ధి జరుగుతుందని ప్రధాని చెప్పారు. ”ఇది చాలా ప్రత్యేకమైన రోజు. రూ.8,300 కోట్ల అభివృద్ధి ప్రాజక్టులను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. రైలు, రోడ్డు ప్రాజెక్టులతో తమిళనాడుకు మరింత అనుసంధానం పెరుగుతుంది. తమిళనాడు సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తు్న్నాను” అని మోదీ తెలిపారు.
అభివృద్ధి భారతం (వికసిత్ భారత్)లో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని, పంబన్ రైల్వే వంతెనపై కొత్త రైలు సర్వీసుతో రామేశ్వరం, చెన్నై, దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని ప్రధాని చెప్పారు. ఇందువల్ల తమిళనాడులో వాణిజ్యంతో పాటు పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని భరోసా వ్యక్తం చేశారు.
వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న రామేశ్వరం పట్టణంలో నిర్మించిన పంబన్ వంతెన 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రధాని అభివర్ణించారు. ఇదిలా ఉండగా రామేశ్వరానికి వెళ్లే పంబన్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సందర్భంగా రామేశ్వరం ఆలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి