ఈ విషయాన్ని కేంద్రంలోని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.. అయితే, ఇక్కడో మార్గం ఉందని పేర్కొంది. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పునఃపరిశీలించే నిబంధన ఉందని పేర్కొన్నారు. కాబట్టి ట్రంప్ నిర్ణయం భారత్కు ఎదురుదెబ్బ కాదని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారు తెలిపారు.
“ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం ఉంది. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప, భారత్కు ఎదురుదెబ్బ కాదు” అని అధికారి వివరించారు.
ట్రంప్ విధించిన 26 శాతం టారిఫ్లో 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని సదరు అధికారి వెల్లడించారు. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి విధించనున్నట్లు తెలిపారు. అయితే, సుంకాల ప్రకటన సందర్భంగా భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ చెప్పారు.

More Stories
అమెరికా ఒప్పందంలో వ్యవసాయ, పాడి రంగాలకు పూర్తి రక్షణ
దేశీయ ఐటీ దిగ్గజాల షేర్లు 6 శాతం పతనం
భారత్-చైనా మధ్య 155 బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్యం