మహదేవ్ యాప్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ ఏడాదిగా విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయనేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్ను రూపొందించేందుకు అప్పట్లో సీఎంగా ఉన్న భూపేష్ బఘెల్ తనను ప్రోత్సహించారని, ఆయనకు రూ.508 కోట్లు చెల్లించామని యాప్ ఓనర్ శుభమ్ సోనీ విచారణ సమయంలో సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కేసులో ఈడీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపైన, మరి కొందరిపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. బఘెల్, యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్, శుభం సోని, అనిల్ కుమార్ అగర్వాల్, మరో 14 మంది పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు.
తొలుత ఈ కేసుపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే విచారణ జరిపింది. ఆ తర్వాత సీనియర్ అధికారులు, కీలక నిందితుల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి కేసు అప్పగించారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను భూపేష్ బఘెల్ తోసిపుచ్చారు. తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్లోనూ అధికారికంగా భూపేష్ బఘేల్ పేరు చేర్చడంతో ఈ కేసు రాజకీయంగానూ వేడెక్కే అవకాశం ఉంది. సీబీఐ తదుపరి చర్యపై ఉత్కంఠ నెలకొంది.

More Stories
పిఎం ఇ-డ్రైవ్ పథకం కింద రాష్ట్రాలకు 14 వేల ఎలక్ట్రిక్ బస్సులు
రికార్డు స్థాయిలో ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు రూ.2.4లక్షల కోట్లు
ముంబయిలో రూ.1,745 కోట్ల కొకైన్ పట్టివేత