
ఆలయ ప్రసాదాలకు జీఎస్టీ మినహాయింపు కలిగిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. లోక్సభలో ఆర్థిక బిల్లు 2025పై చర్చ సందర్భంగా ఈ నిర్ణయం భక్తులపై ఉన్న పన్ను భారం తగ్గించడంతోపాటు ఆలయాల్లో ప్రసాదాల పంపిణీకి మరింత ప్రోత్సాహం అందించనుందని చెప్పారు.
ఆలయ కమిటీల నుంచి వచ్చిన అభ్యర్ధనలపై కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. గతంలో ప్రసాదాల విక్రయాలపై జీఎస్టీ అమలులో ఉండటంతో ఆలయాలకు ఆర్థిక భారం పెరిగింది. అయితే, తాజా నిర్ణయంతో భక్తులకు ప్రసాదాలు సరసమైన ధరలకు అందే అవకాశం ఉంది. దీనికి తోడు, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ఇది ఎంతగానో సహాయపడనుంది.
భక్తుల సానుభూతిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇలాంటి మరిన్ని భక్తిపూర్వక సేవలకు మద్దతు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని అంచనా. ప్రస్తుతం దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలపై జీఎస్టీ విధింపునకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇది ఇకపై వర్తించదని స్పష్టంగా తెలిపింది.
ఇది భక్తులకు అనుకూలమైన నిర్ణయంగా ప్రభుత్వం అభివర్ణించింది. ఆలయాల్లో ప్రసాదాలు భక్తులకు నిస్వార్థంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా ఉంది. అయితే, విక్రయించే ప్రసాదాలకు జీఎస్టీ విధింపుతో ఆలయ కమిటీలకు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఏర్పడింది. అందుకే, దీనిని పూర్తిగా తొలగించేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
ఈ ప్రకటనతో పాటు, నిర్మల సీతారామన్ ఆర్ధిక బిల్లు 2025లో ప్రతిపాదించిన 59 సవరణలను వివరించారు. ముఖ్యంగా, ఆన్లైన్ ప్రకటనలపై విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీ (డిజిటల్ పన్ను) రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది గ్లోబల్ డిజిటల్ వాణిజ్య రంగంలో భారతదేశం పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు అనుకూలంగా మారనుంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులలో నెలకొన్న అనిశ్చితిని తొలగించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆన్ లైన్ ప్రకటనలపై 6 శాతం డిజిటల్ పన్నును రద్దు చేశారు. దీనితో పాటు ప్రభుత్వ సవరణలతో లోక్ సభ ఫైనాన్స్ బిల్లు 2025ను లోక్ సభ ఆమోదించింది. దీంతో బడ్జెట్ ఆమోదం ప్రక్రియ లోక్ సభ పూర్తయింది.ఇక రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లు పై చర్చ జరగనున్నది. రాజ్యసభ కూడా ఆమోదిస్తే 2025-26 బడ్జెట్ ఆమోదం ప్రక్రియ పూర్తయినట్లే.
2025 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం స్పాన్సర్ చేస్తున్న పథకాలకు రూ రూ. 5,31,850.21 కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపు రూ. 4,15,356.25 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 16.29 లక్షల కోట్లు కేటాయించారు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వాటా, గ్రాంట్లు, రుణాలు, కేంద్రం ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసే మొత్తంతో సహా రాష్ట్రాలకు బదిలీ అయ్యే నిధులు రూ. 25,01,284 కోట్లు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 4.4శాతంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8 శాతంగా అంచనా వేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి) రూ. 3,56,97,923 కోట్లుగా అంచనా వేశారు. జాతీయ గణాంక సంస్థ విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం జిడీపీ రూ. 3,24,11,406 కోట్లు. అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో జిడిపీ 10.1 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా.
పార్లమెంటు సమావేశాల్లో ఆర్థిక రంగానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో కొన్ని ముఖ్యమైనవి: భారతదేశంలో స్టార్టప్ల వృద్ధికి మరింత ఊతమిచ్చేలా కొత్త విధానాలు ప్రవేశపెట్టారు.
విదేశీ కంపెనీలు భారతదేశంలో నిర్వహించే ఆన్లైన్ ప్రకటనలపై విధిస్తున్న పన్నును పూర్తిగా తొలగించారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో భాగంగా కొన్ని ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. భక్తులకు ఊరట కలిగించే ఈ నిర్ణయంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర ఆర్థిక నిర్ణయాలు దేశీయ వృద్ధికి బలాన్ని అందించనున్నాయి.
కొత్త ఆదాయపు పన్ను (ఐటి) బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చకు చేపట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫిబ్రవరి 13న సభలో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలిస్తోందని తెలియజేశారు. సెలెక్ట్ కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల మొదటి రోజు సమర్పించవలసి ఉంది. ‘మేము దానిని (కొత్త ఆదాయపు పన్ను బిల్లును) వర్షాకాల సమావేశాల్లో చేపడతాం’ అని మంత్రి తెలిపారు.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం