
మరోవైపు ఈ వ్యవహారంలో న్యాయపరమైన దర్యాప్తు జరగాలని, ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ‘దేశ చరిత్రలో ఒక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం ఇదే తొలిసారని’ ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని, పార్లమెంట్లో కూడా ఈ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేశారు.
“గతంలో ఓ న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసి మరుసటి రోజే రాజకీయ పార్టీలో చేరడం, ఓ సీజేఐ పదవీ విరమణ చేసి పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడు మరో న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం ఇలాంటి ఘటనలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయని” తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అభిశంసించాలని సీపీఐ ఎంపీ పి.సందోశ్ కుమార్ డిమాండ్ చేశారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు