
సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేసింది బ్రిడ్జి ఇండియా సంస్థ. బ్రిడ్జి ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో ఇలా సత్కరిస్తూ ఉంటారు.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా చిరంజీవికి అందజేసింది. అందజేస్తోంది. ఇది చిరంజీవి కీర్తి కీరటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది. ఇక గతేడాది దేశ రెండో అత్యున్నత పురస్కార్ పద్మవిభూషణ్ చిరంజీవి కీర్తి కిరీటంలో చేరింది. అలాగే నృత్యాల్లో ఆయన సాధించిన ఘనతని గుర్తించి గిన్నీస్ బుక్లో చోటిచ్చారు.
నృత్యాల్లో గిన్నీస్ రికార్డు అందుకున్న నటుడు ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవి తప్ప ఎవరూ లేరు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డాన్స్ మూవ్స్ చేసారు చిరంజీవి. ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో భాగంగా చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసిన విషయం తెలిసిందే.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక