
అయితే, కాల్పుల విరమణ గురించి మాత్రమే వాళ్లు మాట్లాడతారా? శాంతి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనేది తెలియదని, ఏమి జరుగుతుందో వేచిచూడాలని చెప్పారు. ముందస్తు ఊహాగానాలు సరికాదని స్పష్టం చేశారు.
రైసీనా డైలాగ్లో ప్యానల్ డిస్కషన్పై థరూర్ మాట్లాడుతూ, 2022లో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దానిని ఖండించాలని తాను చెప్పానని గుర్తు చేశారు. అప్పటి తన వాదనకు యూఎస్ చార్టర్లోని ఆదర్శాలే కారణమని తెలిపారు. అంతర్జాతీయ వివిదాల పరిష్కరాన్ని బలాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకించిన చరిత్ర భారత్కు ఉందని గుర్తుచేశారు.
అంతర్జాతీయ సరిహద్దులు, సౌర్వభౌమాధికాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే భారత్ ఖండిచాల్సిందేనని, అయితే ఆరోజు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించినప్పుడు భారత్ ఒక విధానం తీసుకోలేదని తాను విమర్శించానని, అయితే మూడేళ్ల తర్వాత తాను మూర్ఖుడిలా మిగిలానని చెప్పారు. భారత్ వైఖరి చెల్లుబాటు అయిందని, రెండు వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులను మోదీ ఆలింగనం చేసుకోవడం, రెండుచోట్లా ఆమోదం పొందడం మనం చూశామని తెలిపారు.
థరూర్ వ్యాఖ్యలను స్వాగతించిన బీజేపీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని, తీసుకుంటున్న చొరవను శశిథరూర్ ప్రసంగించడాన్ని బీజేపీ నేతలు రవి శంకర్ ప్రసాద్, సంబిత్ పాత్ర స్వాగతించారు. శశిథరూర్ తరహాలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలవాలని వారు కోరారు.
శశిథరూర్కు దౌత్యం గురించి తెలుసునని, ఆయన చాలాకాలం యూఎన్లో పనిచేసారని బీజేపీ నేత సంబిత్ పాత్ర గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మోదీ అనుసరించిన విధానాన్ని శశిథరూర్ ప్రశంసించారని చెప్పారు. పదేపదే మోదీని, దేశాన్ని విమర్శించే కాంగ్రెస్ ఇతర నేతల కూడా ఆయన చూసి నేర్చుకోవాలని హితవు చెప్పారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు