
ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్టుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ఆందోళనను గమనించిన భట్టి వారి దగ్గరికి వచ్చి భరోసా కల్పించాల్సింది పోయి సెక్రటేరియట్ నుంచి పలాయనం చిత్తగించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ.పదివేల కోట్ల బకాయిలను చెల్లించామని అంతకు ముందు భట్టి విక్రమార్క పేర్కొనడం గమనార్హం
శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఆయన మాల్టాడుతూ గత 14 నెలల కాలంలో కొన్ని బకాయిలు జమ చేశామని తెలిపారు. పాత, కొత్త పెండింగ్ బిల్లులు రూ.10వేల కోట్లు తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని తెలిపారు. మరో రూ.8 వేల కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రాధాన్య క్రమంలో ప్రతినెలా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే, పెండింగ్ బిల్లుల కోసం మంత్రులను కలిస్తే, ఆ ఒక్క విషయం మాట్లాడొద్దని చెప్తున్నారని సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దర్శనాల శంకరయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లి, భార్య మెడలో ఉన్న బంగారం కుదువపెట్టి కాంట్రాక్టు పనులు చేశామని, బిల్లులు రాకపోవడంతో అప్పులపాలైన కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
శంకరయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లతో సహా కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులను ఈ నెల 20లోగా క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే, నిరసనలు, నిరాహారదీక్షలు, సచివాలయం ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ఘోష ప్రభుత్వానికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు. తమకు అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదని వాపోయారు. అసోసియేషన్ సలహాదారు అజయ్ మాట్లాడుతూ ఆర్అండ్బీ, పీఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, ఎస్డబ్ల్యూ తదితర శాఖల్లో రూ.10 లక్షలలోపు పనులు చేసిన కాంట్రాక్టర్లు సుమారు ఆరు వేల మంది ఉన్నారని, వీరికి చెల్లించాల్సిన బిల్లులు సుమారు రూ.500 కోట్లు ఉన్నాయని వివరించారు.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!