
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని బోర్డుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది.
విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలను కూడా నిర్వహించాలని తెలిపింది. విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలలను ఆదేశించింది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది. విద్యార్థులకు సరళమైన విధానంలో బోధించడం, వారిలో అభిరుచిని పెంపొందించడానికి వీలు గా 9, 10 తరగతుల పాఠ్యాంశంగా ‘వెన్నెల’ అనే తెలుగు వాచకం పుస్తకాన్ని తీసుకొచ్చింది.
దీనివి నియోగానికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి డా.యోగితా రాణా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ పుస్తకం ఆధారంగా సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల యాజమాన్యాలు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. 8 వరకు త్రిభాషా సూత్రం అమల్లో ఉన్నందున ఆంగ్లం, హిందీలతో పాటు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు.
తొమ్మిది, పది తరగతుల్లో మాత్రం రెండు భాషా సబ్జెక్టులే ఉంటాయి. అందులో ఒకటి ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. మరొకటి హిందీ లేదా వేరే భాషను చదువుకుంటున్నారు. ఇక నుంచి ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. 9వ తరగతి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతికి 2026 27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై అన్ని సిలబస్కు సంబంధించిన పా ఠశాలల్లో తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ కింద ఉండనుంది.
More Stories
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు
ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్కి చెందిన విద్యార్థి మృతి
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది