
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అన్ని నిబంధనలు మారిపోతున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్న ట్రంప్ సర్కార్ మరింత కఠినం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వీసాలకు సంబంధించి డ్రాప్ బాక్స్ రూల్స్ను మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించకపోయినప్పటికీ వీసా అప్లికేషన్ సెంటర్లలో కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకువచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటినుంచి హెచ్-1బీ, టూరిస్ట్ వీసాలు కలిగి ఉన్నవారు తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వీసాల పునరుద్ధరణ కోసం అమెరికా తీసుకువచ్చిన డ్రాప్బాక్స్ నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల వరకు ఇంటర్వ్యూలు లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు దాన్ని 12 నెలలకు తగ్గించారు. అంటే హెచ్ 1బీ, టూరిస్ట్ వీసా గడువు ముగిసిన వారు 12 నెలల లోపు రెన్యువల్ చేయించుకోకపోతే ఆ తర్వాత మళ్లీ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
గతంలో వీసా గడువు దాటి 48 నెలలలోపు మళ్లీ రెన్యువల్ చేసుకునేందుకు డ్రాప్బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలు ఉండేది. వారికి ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించేవారు కాదు. తాజా నిబంధనలతో వీసా గడువు ముగిసి 12 నెలల్లోపు వారికి మాత్రమే డ్రాప్బాక్స్ పద్దతిలో రెన్యువల్ చేసుకునే అనుమతి ఇచ్చారు. అధికారికంగా ఈ నిబంధనలను వెల్లడించకపోయినా వెంటనే వీటిని అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వీసా రెన్యూవల్కు సంబంధించిన కొత్త నిబంధనలను ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తీసుకువచ్చిన రూల్స్తో హెచ్-1బీ వీసాలతోపాటు బీ1, బీ2 వంటి నాన్ఇమిగ్రెంట్ వీసాదారుల అప్లికేషన్లపైనా తీవ్ర ప్రభావం పడనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వీసాదారులు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవడానికి ఇప్పుడు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నిజానికి కరోనా మహమ్మారి వెలుగుచూడక ముందు ఈ 12 నెలల నిబంధన ఉండేది. కరోనా తర్వాత వీసా మంజూరు, రెన్యువల్కు పడుతున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2022లో అప్పటి జో బైడెన్ సర్కార్ ఈ డ్రాప్బాక్స్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పద్ధతిలోనే వీసా రెన్యూవల్ చేయాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయంతో భారతీయులపైనే అధిక ప్రభావం పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్ 1బీ, టూరిస్ట్ వీసాలు కలిగిన భారతీయులు వాటిని రెన్యువల్ చేసుకోవడం మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో బీ1, బీ2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం 440 రోజులకు పైగా వేచిచూస్తున్నారు. తాజా నిర్ణయంతో అది మరింత ఎక్కువ కానుందనే భయాలు నెలకొన్నాయి.
ఇప్పటికే దిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో బీ1/బీ2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం 440 రోజులకు పైగా వేచి ఉంటున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువమంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాల జారీ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. డ్రాప్బాక్స్పై ఆధారపడుతున్న బిజినెస్ ట్రావెలర్స్, వృత్తినిపుణులు వీసాల (హెచ్-1బీ) పునరుద్ధరణకు ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
More Stories
కోల్కతాలో భారీ వర్షం… విద్యుత్ షాక్ లకు 9 మంది మృతి
మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం