
సబ్ కా సాత్.. సబ్ కా వికాస్లో కాంగ్రెస్కు ఇబ్బంది ఏంటో అర్థంకావడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా రాజ్యసభలో ప్రధాని ప్రసంగింస్తూ దేశ ప్రజలందరికి సేవ చేసేందుకు మనం ఇక్కడున్నామని.., కానీ, ఫ్యామిలీ ఫస్ట్ అన్నదే కాంగ్రెస్ విధానమని, నేషన్ ఫస్ట్ అనేది మా విధానమని చెప్పారు.
“ఫ్యామిలీ ఫస్ట్ అన్నది కాంగ్రెస్ సిద్ధాంతం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే కాంగ్రెస్కు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ మోడల్ అంటే అబద్ధాలు, మోసం, బుజ్జగింపు, పక్షపాతం కలయిక. కానీ నేషన్ ఫస్ట్ అన్నది మా విధానం. అందుకే ప్రజలు అభివృద్ధి మోడల్కు మద్దతు ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అందరనీ సంతృప్తి పరిచే మోడల్. ప్రజల సంక్షేమం కోసం వనరులను గరిష్ఠంగా ఉపయోగించుకోవడమే మా ప్రయత్నం” అని మోదీ చెప్పారు.
‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా ఉందని కొనియాడారు. అది మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని చూపించిందని పేర్కొన్నారు.
“దేశానికి ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి. ఎప్పుడూ దేశ ప్రగతి గురించే మా ఆలోచన ఉంటుంది. పేద ప్రజల ఉన్నతి కోసమే మా కార్యక్రమాలు ఉంటాయి. పదేళ్లుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాం. దశాబ్దాలుగా ఓబీసీలు నిరాశలో కూరుకుపోయారు. ఓబీసీ ఎంపీల ప్రతిపాదనలను కాంగ్రెస్ తిరస్కరించింది. ఓబీసీ ఎంపీల ప్రతిపాదనలను కాంగ్రెస్ తిరస్కరించింది. ఓబీసీ ఎంపీల ఇబ్బందులు, కష్టాలు మేం విన్నాం” అని ప్రధాని తెలిపారు.
ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారి కోసం 10 శాతం రిజర్వేషన్ తెచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. “ఎస్టీ, ఎస్టీ, బీసీలకు నష్టం లేకుండా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఓబీసీలు కూడా స్వాగతించారు. దివ్యాంగుల కోసం ఎన్నో ఉపాధి కల్పన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ట్రాన్స్జెండర్లకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం” అని ప్రధాని చెప్పారు.
“చరిత్రాత్మకమైన నారీశక్తి వందన్ చట్టం కూడా చేశాం. కొత్త పార్లమెంటు భవనంలో తొలి నిర్ణయం నారీ శక్తి గురించే. అంబేడ్కర్కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్కు మనసు అంగీకరించలేదు. అంబేడ్కర్ను ఓడించేందుకు కాంగ్రెస్ అనేక కుట్రలు చేసింది. కానీ ఇప్పుడు వారు జై భీమ్ అని అనాల్సి వస్తుంది. మా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక, పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టింది. అంబేద్కర్ కలలను పీఎం ముద్రా యోజన వంటి పథకాల ద్వారా మేము సాకారం చేస్తున్నాము. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం మా ప్రాధాన్యం.” అని ప్రధాని పేర్కొన్నారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్పీఠ్ అవార్డు
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
నాగ్పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?