మ‌హిళా క‌లెక్ట‌ర్‌పై నోరు పారేసుకున్న మంత్రి పొంగులేటి

మ‌హిళా క‌లెక్ట‌ర్‌పై నోరు పారేసుకున్న మంత్రి పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్ ప‌ట్ల రుస‌రుస‌లాడారు. మ‌హిళా క‌లెక్ట‌ర్ అని కూడా చూడ‌కుండా ఆమెను కేంద్ర మంత్రుల ముందు అవ‌మానించేలా మాట్లాడారు. కామ‌న్ సెన్స్ ఉందా లేదా అంటూ క‌లెక్ట‌ర్ ప‌మేలా సత్ప‌తిపై నోరు పారేసుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 

దీంతో క‌లెక్ట‌ర్ అవ‌మానంగా భావించి, కార్య‌క్ర‌మం ముగిసే వ‌ర‌కూ ముభావంగా ఉన్నారు.  కేంద్ర, రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నపుడు ఏసీపీ కూడా అందుబాటులో లేడని మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ అసహనం వ్యక్తంచేశారు. శుక్రవారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. 

కరీంనగర్‌లోని మల్టీపర్పస్‌ స్కూల్‌ వద్ద పార్క్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌లు, నిరంతర నీటి సరఫరాను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తోపులాట జరుగగా మంత్రి పొంగులేటి పక్కనుంచి నడుస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతిని చూసి ఒక్కసారిగా అసహనానికి గరయ్యారు.

 ‘వాట్‌ ఈజ్‌ దిస్‌, వాటర్‌ యూ డూయింగ్‌.. కొంచెమైనా కామన్‌ సెన్స్‌ ఉండదా.. ఎస్పీ ఎక్కడ’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో కలెక్టర్‌ నిశ్చేష్టురాలై పోయారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా అసహనం వ్యక్తంచేశారు. మహిళ అని కూడా చూడకుండా కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. 

సభ ముగిసిన తర్వాత మంత్రులకు వీడ్కోలు పలికేందుకు వెళ్లినపుడు కూడా మంత్రులిద్దరూ కలెక్టర్‌ను పట్టించుకోకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయారు. . ఈ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి పొంగులేటి క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తిపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వాట్ ఆర్‌ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా ఆగ్రహించారు. అస‌లు కామ‌న్ సెన్స్ ఉందా..? అని క‌లెక్ట‌ర్ ముఖం చూస్తూ సీరియ‌స్ అయ్యారు.

ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో ఇద్దరు రాష్ట్రమంత్రులు పర్యటన సందర్భంగా ఏం ఏర్పాట్లు చేశారని సీరియస్ అయ్యారు.   మేమంటే రోజు ఏదో సర్దుకుంటామని, నలుగురు మంత్రులు ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితియేనా? అని మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌నీసం ఏసీపీ కూడా లేర‌ని వాపోయారు. క‌లెక్ట‌ర్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నోరు పారేసుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.