తమిళనాడు సర్కారు, గవర్నర్‌పై సుప్రీం ఆగ్రహం

తమిళనాడు సర్కారు, గవర్నర్‌పై సుప్రీం ఆగ్రహం
తమిళనాడు సర్కారుతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా వారిద్దరి మధ్య చాలా కాలంగా నడుస్తున్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.  తమిళనాడులో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకానికి తన అధికారాలను పరిమతం చేసేందుకు రూపొందిచిన బిల్లులను ఆమోదించడానికి గవర్నర్ ఆర్.ఎన్ రవి నిరాకరించారు. దీంతో చాలా కాలంగా డీఎంకే ప్రభుత్వంతో పాటు రవి మధ్య గొడవ జరుగుతోంది.

తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్.ఎన్ రవికి మధ్య జరుగుతున్న గొడవపై ఆ రాష్ట్ర సర్కారే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈక్రమంలోనే సుప్రీంకోర్టు  శుకవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాలను జస్టిస్ ఎస్బీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. మీ మధ్య ఏర్పడిన సమస్యను మీరు పరిష్కరించుకోకపోతే మేము జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించింది. 

 
తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే విశ్వవిద్యాలయాలకు గౌరవ ఛాన్సలర్ న హోదాలో వైస్ ఛాన్సలర్లను నియమించాలని గవర్నర్ ఆర్.ఎన్ రవి పట్టుబట్టడంతో ఈ వివాదం తలెత్తింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సిబ్బందిని నియమించే గవర్నర్ సామర్థ్యంపై కూడా ఇరుపక్షాలు విభేదిస్తున్నాయి.  ముఖ్యంగా మద్రాస్ విశ్వవిద్యాలయం, భారతీయార్ విశ్వవిద్యాలయం, తమిళనాడు టీచర్స్ ట్రైనింగ్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సర్లను నియమించడానికి.. గవర్నర్ రవి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 
అయితే ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నుంచి సభ్యలును తొలగించడంతో పాటు ఆ కమిటీని పునరుద్ధరించింది. అంతకు ముందే అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని ప్రభుత్వం ఆమోదించిన రెండు బిల్లులతో సహా పలు బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. 
బీజేపీ నియమించిన గవర్నర్ రవి ఉద్దేశపూర్వకంగానే బిల్లులు ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారని, ఎన్నికైన పరిపాలను అణగదొక్కడం ద్వారా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించింది. అయితే 2023 నవంబర్‌లో విచారణ చేపట్టిన న్యాయస్థానం 2020 సంవత్సరం నుంచి ఈ బిల్లులను ఎందుకు పెండింగ్‌లో పెట్టారంటూ గవర్నర్‌ను నిలదీసింది. 
 
ముఖ్యంగా 10 బిల్లులను రవి తిరస్కరించారని కూడా వెల్లడించింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీల పాలనలో ఉన్న పంజాబ్, కేరళ రాష్ట్రాలు కూడా ఇదే విధమైన పిటిషన్లను విచారిస్తున్నట్లు తెలిపిన కోర్టు గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లులను ఆమోదించకుండా, అసెంబ్లీకి పంపించకుండా తన వద్దే ఉంచుకోవచ్చా? అని కూడా ప్రశ్నించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఏ రాష్ట్ర గవర్నర్‌కు అయినా మూడు మార్గాలు మాత్రామే ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. ఒకటి బిల్లులను ఆమోదించడం, రెండోది ఆమోదించకుండా తిరస్కరించకుండా తన వద్దే ఉంచుకోవడం, మూడోది బిల్లులను రాష్ట్రపతికి పంపడం మాత్రమే చేస్తారని చెప్పింది. ఇక అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉన్న ఈ కే మరసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.