శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం తిరుమలలో మరోసారి కలకలం రేపింది. నకిలీ టికెట్లతో భక్తులకు దర్శనం చేయిస్తున్న ఇంటి దొంగలను టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. శ్రీవారి దర్శనానికి సంబంధించిన నకిలీ టికెట్లు విక్రయిస్తూ లక్షల రూపాయలు దండుకుంటుకున్న దళారీలను రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
టీటీడీ సిబ్బంది లక్ష్మీపతి, మణికంఠ, భాను ప్రకాశ్ ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా దందా నిర్వహిస్తున్నారు. స్వామివారి ఆదాయాన్ని అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండి కొడుతూ చివరికి అడ్డంగా దొరికిపోయారు. విచారణలో మరో ఐదుగురు నిందితులను అధికారులు గుర్తించారు.
వారిలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ ఉద్యోగి లక్ష్మీపతి, అగ్నిమాపక శాఖ సిబ్బంది మణికంఠ, భానుప్రకాశ్, ట్యాక్సీ డ్రైవర్లు శశి, జగదీశ్ ఉన్నారు. లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో దర్శనానికి పంపుతున్నట్లు గుర్తించారు. అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు ారిని అడ్డుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద వారిని నిలిపివేసి నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మణికంఠ సాయంతో నకిలీ టికెట్లు తయారు చేస్తున్నారని, ట్యాక్సీ డ్రైవర్లు శశి (తిరుపతి), జగదీశ్ (చెన్నై) ద్వారా భక్తులకు టికెట్లు విక్రయిస్తున్నట్లు తేల్చారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగళూరుకు చెందిన 11 మంది భక్తుల నుంచి రూ.19వేలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులను టిటిడి విజిలెన్స్ అధికారులు, వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు.

More Stories
ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు
ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?