
* ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్య … 9 మంది మృతి
దాడికి గురైన బస్సులోని సిబ్బంది దంతెవాడ, నారాయణ్పుర్, బీజాపుర్లో యాంటీ నక్సలైట్ అపరేషన్ పూర్తి చేసుకుని బేస్ క్యాంప్నకు తిరుగుప్రయాణమయ్యారు. భద్రతా బలగాల కాన్వాయ్ బీజాపుర్లోని కుట్రూ హరదారిపై వెళుతున్న క్రమంలో అంబేలీ గ్రామం వద్ద మావోయిస్టులు ఐఈడీ పేల్చేశారు.
భారీ పేలుడు ధాటికి కాన్వాయ్లోని ఓ వాహనం చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి రీఇన్ఫోర్స్మెంట్ టీమ్స్ను పంపించినట్లు ఐజీ సుందర్రాజ్ తెలిపారు.
ఇదిలా ఉండగా, గత రెండేళ్లలో భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఓ అధికారి వెల్లడించారు. అయితే కూంబింగ్ తర్వాత తిరిగి వెళ్తున్న జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టుల చేసిన ఈ దాడిపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ తీవ్రంగా స్పందించారు.
“బీజాపుర్లో నక్సలైట్లు జరిపిన దాడిలో 8 మంది జవాన్లు వీరమరణ పొందారనే వార్త చాలా బాధాకరం. అమరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అమరులైన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. బస్తర్లో జరుగుతున్న నక్సల్స్ నిర్మూలన చర్యలపై నక్సలైట్లు విసుగు చెందుతున్నారు. అందుకే ఈ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. జవాన్ల బలిదానం వృథా కాదు, నక్సలిజాన్ని అంతం చేసేందుకు మా పోరాటం బలంగా కొనసాగుతుంది” అని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
శనివారం అర్థరాత్రి ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఓ డీఆర్జీ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు జవాన్ల కాన్వాయ్పై దాడి చేశారు.
2023 ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న కాన్వాయ్పై నక్సలైట్లు ఇలాగే దాడి చేశారు. ఆ ఘటనలో 10మంది పోలీసులు సిబ్బంది సహా ఓ డ్రైవర్ మృతిచెందాడు. మరోవైపు శనివారం ఛత్తీస్గఢ్లోని నారాయణ్ పూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఐదుకి పెరిగింది. ఇక వీరిలో ఇద్దరు మహిళలని భద్రతా దళాలు వివరించాయి.ఈ ఎన్ కౌంటర్లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సైతం మరణించిన విషయం విధితమే.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు