
గత యూపీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా పెద్దయెత్తున బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోయాయని ఆయన స్పష్టం చేశారు.‘ఆర్థిక సంక్షోభం తర్వాత గతంలో ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడ్డాయి. భారత దేశం ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించి ఇబ్బందులు ఎదుర్కొంది. యూపీఏ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాల కారణంగా ప్రాజెక్టుల అనుమతిలో తీవ్ర జాప్యం ఏర్పడింది. పర్యావరణ అనుమతులు లభించ లేదు. దాంతో ఆర్థిక వ్యవస్థలో ఎన్పీఏలు కూడా పేరుకుపోయాయి’ అని ఆయన వివరించారు.
ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా తన ముందు పాలకులు ఆర్బీఐలో రుణాలను మొండి బకాయిలుగా ప్రకటించడంపై మారటోరింయను అనుమతించే విధానాన్ని అమలు చేశారని చెప్పారు. దీని ఫలితంగా బ్యాంకుల్లో మొండి బకాయిలను గుర్తించకుండా ఉంచడంతో అవి పెద్దమొత్తంలో పేరుకుపోయాయని చెప్పారు.
తాను బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాది 2014లోనే మారటోరియాన్ని రద్దు చేశానని గుర్తు చేశారు. దాంతో చాలా మొండి బకాయిలు కూడా రద్దయ్యాయని తెలిపారు. ఇలాంటి ప్రక్షాళన బ్యాంకింగ్ వ్యవస్థకు అవసరమని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఈ మొండి బకాయిలను బ్యాలెన్స్ షీట్ల్లో ప్రతి ఏడాది చూపుకుంటూ పోతే బ్యాంకులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవని, కొత్త రుణాలు ఇవ్వలేవని రఘురామ్ రాజన్ తెలిపారు.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ