హత్యలకు గురైన జర్నలిస్టుల్లో మూడో వంతు మంది గాజాలోనే

హత్యలకు గురైన జర్నలిస్టుల్లో మూడో వంతు మంది గాజాలోనే

ప్రపంచవ్యాప్తంగా 54 మంది జర్నలిస్టులు తమ విధులను నిర్వహిస్తున్నప్పుడు లేదా వారి వృత్తి కారణంగా 2024లో హత్యలకు గురికాగా, వారిలో మూడోవంతు మంది ఇజ్రాయిల్ సైన్యం చేతిలో మరణించినట్లు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆరెస్ఎఎఫ్)  ప్రచురించిన వార్షిక నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరంలో 18 మంది జర్నలిస్టుల మరణాలకు ఇజ్రాయెల్ సాయుధ దళాలు కారణమయ్యాయని తెలిపింది. 

గాజాలో 16 మంది, లెబనాన్‌లో ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొంది. పాలస్తీనా జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా, గత ఐదేళ్లలో(డిసెంబర్ 1 వరకు) ఇతర దేశాల కంటే ఎక్కువ మరణాల సంఖ్య నమోదైందని ఆరెస్ఎఎఫ్ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

“జర్నలిస్టులపై ఇజ్రాయెల్ సైన్యం చేసిన యుద్ధ నేరాల”పై ఆ సంస్థ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి)లో నాలుగు ఫిర్యాదులను దాఖలు చేసింది. అక్టోబర్ 2023లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాలో మొత్తం 145 మందికి పైగా జర్నలిస్టులు మరణించారని, వారిలో 35 మంది విధుల నిర్వహణలో మరణించారని  ఆర్‌ఎస్‌ఎఫ్ తెలిపింది.

2024లో ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మరణించారని, వారిలో సగానికి పైగా గాజాలో ఉన్నారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐ.ఎఫ్.జె)  ప్రచురించిన మరోప్రత్యేక నివేదికలో పేర్కొంది. మృతుల లెక్కించడంలో ఉపయోగించే రెండు వేర్వేరు పద్ధతుల కారణంగా ఐ.ఎఫ్.జె, ఆరెస్ఎఎఫ్ మధ్య గణాంకాలు విభిన్నంగా ఉంటాయి.

ఇజ్రాయిల్ ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టులకు హాని చేస్తుందనే నివేదికను ఖండించింది. అయితే సైనిక వైమానిక దాడుల్లో కొందరు మరణించారని అంగీకరించింది. ఆరెస్ఎఎఫ్ గణాంకాల ప్రకారం, డిసెంబర్ 1 నాటికి  ప్రపంచవ్యాప్తంగా 550 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. గత ఏడాది 513 మందిని అరెస్టు చేశారు.