
హైపర్లూప్ పాడ్లు మధ్యలో ఎలాంటి స్టాప్లు లేకుండా ఆరంభ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి ప్రయాణిస్తాయి. అందుకే వీటిని ఇంటర్ సిటీ ట్రాన్స్పోర్ట్గా ఏర్పాటుచేసేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశంలో ముంబై-పుణె కారిడార్లో మొదటి హైపర్లూప్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
రోడ్డు ప్రయాణానికి మూడు గంటలు పట్టే ఈ రెండు స్టేషన్ల మధ్య హైపర్లూప్లో 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఆ తర్వాత చెన్నై – బెంగళూరు, ఢిల్లీ – చండీగఢ్ మధ్య కూడా హైపర్లూప్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. పుణెకు చెందిన క్విన్ట్రాన్స్ హైపర్లూప్ అనే అంకుర సంస్థ కూడా హైపర్లూప్ కార్గో వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నది.
హైపర్లూప్ అనే హైస్పీడ్ రవాణా వ్యవస్థ ఆలోచన 2012లో మొదటిసారి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మదిలో పుట్టింది. తక్కువ పీడనం ఉండే ట్యూబ్(భారీ పైప్లైన్ లాంటిది)లో చిన్న పాడ్(రైలు బోగీ లాంటిది)ల ద్వారా ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఒక్కో పాడ్లో 24 నుంచి 28 మంది ప్రయాణించవచ్చు.
అయస్కాంతాలతో ఒత్తిడి కలిగించి, రాపిడి(ఫ్రిక్షన్) తగ్గించడం ద్వారా అత్యంత వేగంతో ఈ పాడ్లు ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణిస్తాయి. గంటకు 1,100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉండేలా హైపర్లూప్ వ్యవస్థను రూపొందిస్తారు. హైపర్లూప్ వ్యవస్థ ప్రయాణ వేగాన్ని గణనీయంగా పెంచడంతో పాటు ఇంధన అవసరాన్ని తగ్గిస్తుంది.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా