ఏడేళ్ల తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థులు

ఏడేళ్ల తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో  ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థులు

ఏడు సంవత్సరాల తర్వాత, కాంగ్రెస్ మద్దతుగల నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డుసు) ఎన్నికలలో పునరాగమనం చేసి, అధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ స్థానాలను కైవసం చేసుకుంది. వారి అభ్యర్థి రౌనక్ ఖత్రీ అధ్యక్షునిగా  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అభ్యర్థి రిషబ్ చౌదరిని 1,300 కంటే ఎక్కువ ఓట్లతో ఓడించి విజేతగా నిలిచారు.

డుసు 2024 ఎన్నికల ఫలితాలు దాదాపు రెండు నెలల విరామం తర్వాత సోమవారం ప్రకటించారు. ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. డుసు 2024 ఎన్నికల్లో రెండు విద్యార్థి సంఘాలు చెరో రెండు పదవులను దక్కించుకున్నాయి. డుసు 2024 ఎన్నికల్లో  ఏబీవీపీ ఉపాధ్యక్షుడు, కార్యదర్శి స్థానాలను కైవసం చేసుకోగా,  ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ పదవులను దక్కించుకుంది.

యూనివర్సిటీ ఆవరణలోని పోస్టర్లు, హోర్డింగ్‌లు, గ్రాఫిటీలతో సహా డిఫేస్‌మెంట్ మెటీరియల్‌ను తొలగించాలని కోర్టు ఆదేశం కారణంగా ఆలస్యంగా  ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.  కళాశాల స్థాయి ఎన్నికలలో, ఏబీవీపీ ఐదు కళాశాలలలో క్లీన్ స్వీప్ సాధించగా,  ఎన్‌ఎస్‌యూఐ రెండు కళాశాలలలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంది.

అధ్యక్ష పదవికి, ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి రౌనక్ ఖత్రీ గెలుపొందగా,  ఏబీవీపీకి చెందిన భాను ప్రతాప్ ఉపాధ్యక్ష స్థానాన్ని దక్కించుకున్నారు. ఎబివిపికి చెందిన మిత్రవింద కరన్వాల్ కార్యదర్శిగా, ఎన్ఎస్‌యుఐకి చెందిన లోకేష్ చౌదరి జాయింట్ సెక్రటరీగా గెలుపొందారు.