గత ఏడాది అక్టోబర్ 8 నుంచి ఈ ఏడాది మే 20 వరకు జరిగిన యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలను పరిశీలించినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తెలిపింది. నిందితులు ఉద్దేశపూర్వకంగా పౌరులను, పరిమిత వైద్య సామాగ్రిని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించింది. దీనికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని ఐసీసీ కోర్టు పేర్కొంది. తమకు అపారమైన బాధను కలిగించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
‘గాజాలోని పౌరులపై ఉద్దేశపూర్వకంగా దాడులకు నేతృత్వం వహించిన నెతన్యాహు, గాలంట్ ఈ యుద్ద నేరాలకు బాధ్యత వహిస్తారు. దీనిని విశ్వసించడానికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని ఛాంబర్ అంచనా వేసింది’ అని పేర్కొంది. కోర్టు అధికార పరిధిని ఇజ్రాయెల్ ఆమోదించాల్సిన అవసరం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.
మరోవైపు గత ఏడాది అక్టోబర్ 7న గాజాపై పట్టున్న హమాస్ ఇజ్రాయెల్పై మెరుపుదాడులు చేసింది. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడంతోపాటు పలువురిని బంధించి గాజాకు తరలించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై దాడులు చేసింది. మహిళలు, పిల్లలతో సహా వేలాది మంది మరణించారు. వైమానిక దాడుల్లో ఆసుపత్రులు, స్కూళ్లు వంటివి నేలమట్టమయ్యాయి.

More Stories
సరిహద్దులో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ