
బీజేపీ అంటే మతతత్వ పార్టీ కాదని, మానవత్వ పార్టీ అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్లో హిందువులకు రక్షణ లేదని పేర్కొంటూ భారతదేశంలో మాత్రం ఇతర మతాల హీరోలను ప్రజలు అభిమానిస్తారని గుర్తు చేశారు. శనివారం మహారాష్ట్రలో వివిధ నియోజకవర్గాల్లో పవన్ ప్రచారంలో పాల్గొన్నారు.
లాతూర్లో బీజేపీ అభ్యర్థి అర్చన పాటిల్, నాందేడ్ జిల్లా భోకర్ నియోజకవర్గం అభ్యర్థి శ్రీజయ చవాన్ కోసం ఎన్నికల ప్రచారం చేశారు. లాతూర్లో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. నాందేడ్ జిల్లా బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, సనాతన ధర్మం, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీని గెలిపించాలని కోరారు.
12 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేశారని తెలిపారు. పాలాజ్ సత్యగణేష్ ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులతో మాట్లాడి ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. కాగా, బహిరంగ సభలో అభిమానులు కేకలు వేయడంతో ‘‘మీరంతా సరిహద్దు తెలంగాణ వాసులని అర్థమైంది’’అని పవన్ చెప్పారు.
తెలంగాణ ఉద్యమ గడ్డ అని కొనియాడుతూ.. బండెనుక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అనే పాటను పాడారు. మహారాష్ట్ర నేల సంస్కృతి, సంప్రదాయాల కలబోతని, ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పోరాట పౌరుషం నింపిన గడ్డ అని పవన్ కొనియాడారు.
డా.బీఆర్ అంబేడ్కర్ లాంటి మహనీయులను దేశానికి అందించిన గడ్డ మహారాష్ట్ర అని, కర్మభూమి అయిన మహారాష్ట్ర దేశానికి ఓ స్ఫూర్తి మంత్రమని పేర్కొన్నారు. పోరాటంలో ముందుండే మరాఠా ప్రజలను కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జీవితంలో పదవులు ముఖ్యం కాదని… జాతి, దేశం కోసం పాటుపడే ఆలోచన అత్యుత్తమని నమ్మే బాల్థాక్రే సిద్ధాంతాలు తనకు స్ఫూర్తి అని చెప్పారు.
More Stories
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’
హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్