
రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని అంటూ ఆయన ఇతర రాష్ట్రాలలోని అనుభవాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ చెప్పారు. ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్తు తరానికి చెడ్డపేరు తప్ప మరొకటి మిగలదు అంటూ ఎన్నికల హామీలపై ఖర్గే ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు హామీలను ఇస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో ఐదు గ్యాంరటీలతో, తెలంగాణలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. అయితే, గ్యారెంటీల పేరుతో ఆకర్షించి ఓట్లు వేయించుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఉచిత పథకాలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఆడంబరంగా ప్రారంభించిన ఉచిత బస్సు పథకానికి ఏడాదిన్నరకే మంగళం పాడేందుకు సిద్ధమైంది. ఈ పథకాన్ని నిలిపేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. తెలంగాణలో సైతం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో హస్తం పార్టీ విఫలమవుతోందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హామీలపై కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు